మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

  • పవనన్న ప్రజా బాట 63వ రోజు కార్యక్రమంలో భాగంగా మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

విశాఖ: పవనన్న ప్రజా బాట 63వ రోజు కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో మృతి చెందిన గున్నమ్మ కుటుంబానికి జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్. కందుల నాగరాజు అంతిమ సంస్కారం నిమిత్తమై ఆర్థిక సహాయం అందజేశారు. గున్నమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ కందుల నాగరాజు స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యతని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తను అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచి పనులకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎటువంటి స్వలాభ పేక్ష లేకుండా సాయం చేయడం మాత్రమే తనకు తెలుసని చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు జనసేన సీనియర్ నాయకులు రఘు, త్రినాధ్, గాజుల శ్రీను, పవన్, మంగ బద్రీనాథ్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.