రిటర్నింగ్ అధికారికి వినతిపత్రమిచ్చిన డా.మాధవరెడ్డి

తెలంగాణ,శేరిలింగంపల్లి, శుక్రవారం చందానగర్ శాంతి నగర్ నందు గల శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం బయట ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు, గేటుకు ఉన్న స్టిక్కర్లు అన్నీ కూడా శేరిలింగంపల్లి జి.హెచ్.ఎం.సి ఉద్యోగులు అక్రమంగా తీసివేయడం జరిగింది. పార్టీ కార్యాలయంలో ఉన్న మా కార్యకర్తలు వారిస్తున్నా వినకుండా, కేవలం ప్రభుత్వ ప్రతినిధుల ఒత్తిడితో ఈ దుశ్చర్య జరిగింది. ఈ చర్యను జనసేన పార్టీ ఇంఛార్జి మాధవ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, రిటర్నింగ్ అధికారి శ్రీనివాస రెడ్డికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేసి తగిన న్యాయం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.