మిరియాల రాఘవరావుని మర్యాదపూర్వకంగా కలిసిన డా.మాధవ రెడ్డి

తెలంగాణ, శేరిలింగంపల్లి, జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జి డా.మాధవ రెడ్డి బుధవారం తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకులు మరియు జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలకి అధ్యక్షులు, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావుని మర్యాదపూర్వకంగా కలిసి, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇచ్చి జనసేన విజయానికి దోహద పడాలని కోరారు. దీనికి వారు తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియొజకవర్గంలోనున్న కాపు మరియు ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇస్తూ సానుకూలంగా స్పందించడం జరిగింది.