డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రికి అభినందనలు తెలిపిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: సంకురాత్రి ఫౌండేషన్ అధినేత శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా అనేకమందికి కంటి చూపును అందిస్తూ, ఉచిత సేవలు అందించిన మన డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రికి అభినందనలు తెలపడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డుకే వన్నె తెచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి గారికి అభినందనలు తెలుపుతూ సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందిస్తూ శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా అనేక వేల మంది ప్రజలకు కంటి చూపు నందిస్తూ వేల కుటుంబాలకు వెలుగునిచ్చినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి గారికి ఈ అవార్డు రావడం ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి కూడా గర్వకారణం అని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, బొజ్జ గోపికృష్ణ, సామినేడి అప్పన్న, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర, పల్నాటి మధు, కంద చక్రబాబు, కారిపిరెడ్డి వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.