అగ్ని ప్రమాదబాధితులకు అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డా. శ్రీధర్ పిల్లా సమ్మంగి నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడగా 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం 4వ వార్డు నందు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై వారి కుటుంబం నిరాశ్రయులయ్యారు. రెక్కాడితేనే గాని డొక్కా ఆడనటువంటి కుటుంబం, వాళ్లకు ఇల్లు నిర్మించి పునరావాసం కల్పించాలని, కుటుంబానికి రెండు నుంచి మూడు లక్షలు రూపాయలు చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డాక్టర్ శ్రీధర్ పిల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆ ఇళ్ళకు రంగు వేయడం తప్పితే ఇచ్చిన పాపాన లేదని అవి ఇచ్చుంటే కనీసం ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడే అవకాశం ఉండి ఉండేదని డాక్టర్ శ్రీధర్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అనంతరం అక్కడున్న ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి పలు సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాకర నాగబాబు, దాకే బుజ్జి, మైనబత్తుల చిన్న, అల్లపు వచ్చారా, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.