పలు కార్యక్రమాలలో పాల్గొన్న డా.వంపురు గంగులయ్య

పలు కార్యక్రమాలలో పాల్గొన్న డా.వంపురు గంగులయ్య జి.మాడుగుల మండలం, బోయితేలి పంచాయితీ, సూరిమెట్ట గ్రామంలో పెద్దలతో జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి డా.. వంపురు గంగులయ్య పలు కీలక ఆదివాసీ హక్కులు, దుర్వినియోగమౌతున్న చట్టాలు, ఆదివాసీ ఉనికి, జీవో నెం3 మూలంగా.. దగా పడుతున్న నిరుద్యోగ యువత జీవనాధారం లేక ఎలా అసాంఘిక పనులు చెయ్యవలసి వస్తుందో వివరిస్తూ.. రానున్న సమీప భవిష్యత్ లో జనసేన ప్రభుత్వం స్థాపిస్తుందని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం పాత మిత్రుడు కుసంగి కనకయ్య కుమారుడి వివాహానికి హాజరై వధూ,వరులను ఆశీర్వదించి మార్గ మధ్యలో వాకా పల్లి గ్రామ మహిళలతో ముచ్చటిస్తూ.. ఇటుకల పండగ సందర్బంగా మీరు సంతోషంగా ఉండాలని ఏజెన్సీ ఆచారమైన తాచేరు కార్యానికి తమవంతుగా కొంత నగదు అందించారు. జనసేన పార్టీని బలోపేతం చేసే క్రమంలో మీ లాంటి వీరమహిళల భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉందంటూ మహిళనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మంద అధ్యక్షులు మసాడి భీమన్న, రమేష్, గౌరవ ఉపాధ్యక్షులు టీ.వీ రమణ గారు, పాడేరు మండల ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సంతోష్ మజ్జి., జనసైనికులు గ్రామస్తులు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.