జనసైనికుడికి నివాళులర్పించిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: అర్బన్ మండలం, తిరుమల నగర్ కు చెందిన జనసైనికుడు అజయ్ మ్రుతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అజయ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. జనసైనికుడి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.