గంధం నరసింహారావు కుమార్తె వివాహానికి సహాయం చేసిన ద్రోణాదుల అంకారావు

గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్లలో గల ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న గంధం నరసింహారావు తమ కుమార్తె వివాహానికి కొంత సహాయం చేయవలసిందిగా జనసేన పార్టీ వారిని ఆశ్రయించగా వెంటనే స్పందించిన గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ద్రోణాదుల అంకారావు ఆమెను ఆడపడుచుగా భావించి, ఆమెకు పసుపు, కుంకుమ, సారెతో పాటుగా కొంత నగదు అందించటం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం కోసం తన సొంత నిధులతో క్రియాశీలక సభ్యత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా, జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, మండల కార్యదర్శులు షేక్ వలి, గఫూర్, కండపూడి వంశీ, కోసూరి శ్రీకాంత్, గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయి, వీర మహిళ కొత్త అరుణ, పట్టణ నాయకులు బేతంచర్ల ప్రసాద్, నూతి శేషు,నాని, మొగిలి కృష్ణ, ఉదయ్ సామేలు, కోటేశ్వరరావు, శివ, శ్రీను, మొదలగు వారు పాల్గొన్నారు.