కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తారు రోడ్లన్నీ బురద రోడ్లుగా మారాయి

నూజివీడు నియోజకవర్గ దిగవల్లి నుండి రమణక్కపేట, అక్కిరెడ్డిగూడెం, చెక్కపల్లి వరకు గత నెలలో వేసిన నూతన ఆర్&బీ రోడ్లకి ఇరువైపులా మార్జిన్ కి గ్రావెల్ కి బదులు బంకమట్టి వేసి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్ కానీ నేడు వర్షాల కారణంగా తారు రోడ్లన్నీ బురద రోడ్లగా ప్రయాణికులకు, వాహనాదారులకు నరకప్రాయంగా మారాయి గతంలో జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు పత్రికల ద్వారా ముందే వారించినా అధికారులు కాంట్రాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు రోడ్లుకి ఇ దుస్థితి నెలకొంది అని వాపోయారు.