ఏరుపల్లి గ్రామ జనసేన అధ్యక్షులుగా ఈతా శ్రీనివాస్

రామచంద్రపురం రూరల్ ఏరుపల్లి గ్రామ జనసేన అధ్యక్షులుగా ఏరుపల్లి గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికుల ఏకాభిప్రాయ నిర్ణయమై ఈతా శ్రీనివాస్ ని నియమించడం జరిగిందని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటివరకు కొంతకాలం నుండి గ్రామ అధ్యక్షులుగా పనిచేసిన తన సేవలను పార్టీ కోసం అందజేస్తున్న జడ్డు సతీష్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.