కాకినాడ జనసేన ఆధ్వర్యంలో వృద్ధుల గౌరవ కార్యక్రమం

కాకినాడ సిటి: కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక 36వ డివిజన్లో సచివాలయ సమీపంలో వృద్ధులను గౌరవించడం కార్యక్రమం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు సిటి సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు, మిరియాల హైమావతి, చీకట్ల శ్రీనివాస్, సుంకర సురేష్ జనసేన కార్యకర్తలు కలిసి సీనియర్ సిటిజన్ లని గౌరవించడంలో భాగంగా ముమ్మిడి వెంకట్రావును ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాడ్రేవ్ సహాయ కార్యదర్శి లోవరాజు మాట్లాడుతూ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు 92 మంది సీనియర్ సిటిజన్ లను గౌరవించి వారి సలహాలు సూచనలు పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ రూపంలో లెటర్ రాసి పంపాలని సీనియర్ సిటిజన్లను కోరామని తెలిపారు. వీరమహిళ మిరియాల హైమావతి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించుకోవడం, వారి అనుభవాలను పంచుకోవడం ఒక మంచి అనుభూతి అని వారి జీవితానుభవం నేటి యువతకు గొప్ప దిక్సూచి అని తెలిపారు. చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి సీనియర్ సిటిజన్లు ఒక పెద్ద దిక్కు అని గత చరిత్రకి వారే సజీవసాక్షులే కాక మార్గదర్శులుకూడా అని తెలిపారు.