రాజీవ్ కాలనీ పంచాయతీలో జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఎన్నికల ప్రచారం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీ పంచాయతీలో 2024 ఎన్నికల ప్రచారం. జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.