ప్రగడపల్లి జనసేన గ్రామకమిటి ఎన్నిక

పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామంలో చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు గ్రామ కమిటీ వేయడానికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ అద్యక్షులుగా మిడత ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా నరసరపు నాగేంద్ర, గర్షకుటి సుబ్రహ్మణ్యం, ప్రదాన కార్యదర్శిగా కుప్పల నాగు, కార్యదర్శిగా కొత్తపల్లి మురళీగారు, సంయుక్త కార్యదర్శిగా మిడత యేసు, కండ్రాతి దుర్గా ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ గా బుడ్డిగ ముత్యాలు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమములో మండల అధ్యక్షులు గుణపర్తి సత్యనారాయణ, గౌరవ అద్యక్షులు తాడి మంగారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.