ఏలూరు జనసేన పార్టీలోకి భారీ చేరికలు

ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 28 వ డివిజన్ పరిధిలోని బీడీ కాలనీలో గురువారం సేనాపతి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీకి చెందిన సుమారు వందమంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు నారా శేషు పాల్గొని నూతనంగా జాయిన్ అయిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు తట్టుకోలేక వైసీపీ నుండి కార్యకర్తలు జనసేనలోకి చేరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని యువత ముందుకు వస్తున్నారని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి పార్టీల కూటమి అభ్యర్థి బడేటి చంటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పోరేటర్ తంగిరాల సురేష్, జనసేన పార్టీ జిల్లా లీగల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.