పితాని ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలుసు తిప్ప గ్రామము నుండి మత్స్యకార సోదరులు వైయస్సార్, టిడిపి పార్టీల నుండి సంఘాని ధర్మారావు, ఓలేటి శ్రీను, పెమ్మాడి గంగాద్రి, సంఘాన్ని రామకృష్ణ, ఆధ్వర్యంలో సుమారు 75 మంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఆదివారం పితాని బాలక్రిష్ణ సమక్షంలో వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి కండువాలు కప్పి పితాని జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ పై నమ్మకంతో జాయిన్ అయిన మత్స్యకార సోదరులకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణ గారు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మత్స్యకార గ్రామాల నుండి మరిన్ని చేరుకుంటాయని మత్స్యకార సోదరులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున రావు, గుదటి జమ్మి, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, గొల్ల కోటి వెంకన్నబాబు, గొల్లకోటి సాయిబాబు, కడలి వెంకటేశ్వరరావు, దూడల స్వామి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.