రాజంపేట జనసేన ఆధ్వర్యంలో రామయ్య భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు

సిద్ధవటం: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి వారి దర్శనానికి విచ్చేయు భక్తుల దాహార్తిని తీర్చేందుకు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహాయ సహకారాలతో మండల పరిధి కడప-చెన్నై జాతీయ రహదారిలోని ఉప్పరపల్లె గ్రామంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. రాటాల రామయ్య మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని రామయ్య భక్తులకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకరమన్నారు. ఒంటిమిట్ట రామయ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.