ఏటూరు రోడ్డు ప్రమాదం బాధాకరం.. కదిరి శ్రీకాంత్ రెడ్డి

కదిరి: కడప- తాడిపత్రి ప్రధాన రహదారిపై ఏటూరు గ్రామం దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడటం ఎంతో దిగ్బ్రాంతి గురి చేసిందని నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వస్తున్న భక్తులు ఈ విధంగా ఘోర ప్రమాదం పాలవడం విషాదకరమని మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు.