జనసేన గెలుపు బాధ్యత ప్రతి జనసైనికుడు తీసుకోవాలి

  • పెదబయలు మండల జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను, మేనిఫెస్టోను కరపత్రాలుగా ప్రజలకు చేరవేయాలి, అలాగే రానున్న ఎన్నికల్లో మనమంతా సిద్ధంగా ఉండి, పార్టీ కోసం ఎంతో కష్టపడాలని మన జనసేన పార్టీని గెలిపించుకునే బాధ్యత ప్రతి జనసైనికుడు తీసుకోవాలని జాగారపు కళ్యాణ్ కుమార్ తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు హాజరవటం జరిగింది.