ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

గాజువాక: ఓటు హక్కును గుర్తు చేస్తూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరూ ఈ వ్యవస్థలో ఓటు హక్కు కలిగి వుండాలని కొత్త ఓటు నమోదు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గాజువాక చినగంట్యాడ ప్రాంతంలో డిగ్రీ కళాశాలల దగ్గర మరియు స్టీల్ ప్లాంట్ ద్వారం కూర్మన్నపాలేం జంక్షన్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శనతో భారత్ జనసైనిక్స్ టీం ప్రచారం చేసింది. ఈ కార్యక్రమంలో అల్లాడ రవీంద్రబాబు, పలపాల కనకేశ్వరరావు, బద్ది కనకదుర్గ, బోనెల స్వరాజ్, అబ్దుల్ ఖాదర్ జిలాని, కర్రి నర్సింగ్ (ఆర్మీ), లంక మల్లిక, నిడగంట్ల శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.