టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్‌) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 8న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే కరోనా కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో దానిని ఈనెల 15 వరకు పొడిగించారు. తాజాగా మరోమారు అప్లికేషన్ గడువును ఎక్స్‌టెండ్ చేశారు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చని వెల్లడించింది.

రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ .800 చెల్లించాల్సి ఉంటుంది.