పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ శనివారం ఐ పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నరాలశెట్టి గంగాధరం మాతృమూర్తి సాంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన పిల్లా రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గంటా వీధికి చెందిన ఇటీవల మరణించిన గంటా రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మద్దింశెట్టి పురుషోత్తం కడలి వెంకటేశ్వరరావు (కొండ) లంకెలపల్లి జమి, సలాదిరాజా, వాసంశెట్టి బాబ్జి, కోలా నరేష్, పితాని రాజు, సాధనాల భాస్కరరావు, కర్రి శివ, ఉండి వీరబాబు మొదలగు వారు పాల్గొన్నారు.