జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాధిత చిన్నారులకు ఆర్ధిక సహాయం

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఐనవోలులో ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు బరిగెల ప్రణయ్, నందులకు జనసేన పార్టీ ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు బర్ల శివ చిన్నారులను పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ, సోమవారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆయనకి పుట్టినరోజు కానుకగా ఈ పిల్లలకు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో చిన్నారుల బాగోగుల ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు దోనికేన రాకేష్ , గౌడ్ ముంజ రాజు, కుమార్, సంపంగి రంజిత్ కుమార్, ఈద నవీన్, యాకర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.