మరణించిన వీరమహిళ కుటుంబానికి ఆర్థిక సాయం

ఇటీవల దివంగతులైన పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వీరమహిళ యన్నం ధ్రాక్షాయణి కుమారునికి జే.ఎస్.పి రాయల్ సోల్జర్స్ తరుపున కలెక్ట్ చేసిన 55,000 రూపాయలను పార్టీ ప్రధాన కార్యదర్శి, పి.ఎ.సి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సోమవారం గుంటూరు లో అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ధ్రాక్షాయణి కుమారుని చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జే.ఎస్.పి రాయల్ సోల్జర్స్ అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు, పాకనాటి రమాదేవి, జిల్లా కార్యదర్శి నామన శివన్నారాయణ, కొత్త శ్రీనివాస్, యన్నం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *