జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం

కొత్తవలస: ఇటీవల కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరజు సతీష్ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన సందర్భంగా వారి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశముతో కొత్తవలస మండల జనసైనికులు సుమారు 70 వేల రూపాయలు చందాలు వేసుకొని కొత్తవలసలో వర్ధంతికి అన్న సంతర్పణ చేసి మిగిలిన 40 వెలు రూపాయలు కోన మసివాని పాలెంలో నివసమున్న వారి కుటుంబ సభ్యులకు జనసేన నేతలు వబ్బిన సన్యాసి నాయుడు, గొరపల్లి రవి కుమార్ తదితరులు అధ్వర్యంలో ఇవ్వడము జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ నక్కరజు సతీష్ కుటుంబానికి జీవితకాలం అండగా ఉంటామని పిల్లలకు ఉన్నత చదువులకు సహాయము చేస్తామని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేయిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో కొత్తవలస జనసేన మండల పార్టీ నాయకులు రామదుర్గ విజయకుమర్, బోగది మాధవ్, అయ్యప్ప, సురేష్, వెంకటేష్, బలిరెడ్డి అప్పలనాయుడు, ముచకర్ల శ్రీన్, బోని రామగనేష్, గాలి అప్పారావు, దారబాబు, జిన్నల తదితరులు పాల్గొన్నారు.