పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి
పుణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తయారు చేసే ఓ రసాయన పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 14 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం 17 మంది కార్మికులు గల్లంతైనట్లు కంపెనీ వర్గాలు తెలిపారు.
ప్రమాదం సమయంలో మొత్తం 37 మంది పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. భారీ ఎత్తున ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పడంలో నిమగ్నమయ్యాయి. ఇతర సహాయక సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 20 మందిని సురక్షితంగా కాపాడినట్లు తెలుస్తోంది.