ప్రారంభోత్సవం లేకుండానే అందుబాటులోకి రానున్న ఫ్లైఓవర్

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి కరోనా వరుస పెట్టి బ్రేక్స్ వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో చివరికి ముహుర్తం ప్రకారం వాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో రేపు జరగాల్సిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్లైఓవర్‌ ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడంతో. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని తెలియజేశారు. ప్రారంభోత్సవం జరగకపోయినప్పటికీ. ప్రజావసరాల దృష్ట్యా ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి ట్రాఫిక్‌ వదలడం జరుగుతుందన్నారు.

ఏదేమైనా విజయవాడవాసుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. వారి కల ఫలించబోతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర పడబోతోంది. కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.