యుఏఈ జనసేన సహకారంతో వరదబాదితులకు భోజన ఏర్పాట్లు

పి.గన్నవరం, గోదావరి ఎక్కువగా పెరగడం వలన పాశర్లపూడిలంక గ్రామం ముంపునకు గురి అయ్యింది. అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని యుఏఈ జనసేన టీమ్ ఎన్నారై సభ్యులు సహకారంతో అక్కడ ఉన్న ప్రజలకు భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉంటుంది అని మరొకసారి నిరుపించుకున్న యుఏఈ జనసేన టీమ్. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చెరుకురి పార్వతి దేవి, సత్తిబాబు, గ్రామ అధ్యక్షులు ఏసు, బొరుసు నాని, బొరుసు బాబి, బొల్లం సాయి, బొరుసు విరబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.