బత్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రాజానగరం: డొక్కా సీతమ్మ మరియు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా.. రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం వందలాదిమందికి తృప్తిగా భోజనం సమకూర్చుతుంది. నేడు సీతానగరం మండలం సీతానగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఐదవ రోజు డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సీతానగరం జనసేన పార్టీ నాయకులు. రాజకీయాలకు, కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం రాజానగరం, సీతానగరం మరియు కోరుకొండ గ్రామాలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి, దినసరి పని కోసమో, వివిధ ఆరోగ్య పరీక్షల కోసమో మరియు ఇతర పనుల కొరకు గానీ వచ్చిన, పేద వారు, ప్రయాణికులు, బాటసారులు, వృద్దులు, బిక్షాటన చేసుకునే వారు, ఇలా ఆకలితో వచ్చిన వందలాదిమంది ఈ అన్నదాన కార్యక్రమంలో తృప్తిగా భోజనం చేయడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అని కడుపునిండా అన్నం పెట్టి ఆదుకున్నారని ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వందలాది గొంతుకలు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించారు.