టీ.సీ.వరుణ్ ఆధ్వర్యంలో నా సేన కోసం.. నా వంతు
- టీ.సీ.వరుణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా.. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభసందర్భంగా జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్ ఆధ్వర్యంలో “నా సేన కోసం … నా వంతు” కార్యక్రమం రంగ రంగ వైభవంగా తపోవనం సర్కిల్ లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు & అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ నగరంలోని 50 డివిజన్లో వేలాది మందిని కలుపుకుని ఈ కార్యక్రమాని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, అధ్యక్షులు పొదిలి బాబురావు, ప్రాంతీయ కమిటీ మహిళల శ్రీమతి పెండాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, మరియు నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.