అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూత

కాంగ్రెస్ నేత, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్(84) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అయన కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 26న కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో గొగోయ్‌ని హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆయన తిరిగి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నవంబర్ 2న మరోసారి హాస్పిటల్‌లో చేరారు. నెలరోజులుగా హాస్పిటల్ చికిత్స పొందుతున్న తరుణ్ గొగోయ్, శరీరంలోకి క్రిటికల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ సోమవారం రోజున తుదిశ్వాస విడిచారు. గత 50 ఏళ్లుగా అయన రాజకీయాల్లో ఉన్నారు. అస్సాంకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.