గడప గడప పాయె.. బస్సు యాత్ర వచ్చే.. : ఎస్ వి బాబు
వైసిపి అధికారంలోకి వచ్చాక గడచిన మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలను జనాలకు వివరిస్తాంమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి మంగళం పాడారు.
వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడే ప్రజలు నిలదీయడంతో వైసిపి ప్రభుత్వం రూటు మార్చింది.
గత మూడేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టుపట్టిన వైసిపి యొక్క అరాచకాలకు జనం తిరగబడుతున్నారు.
సుపరిపాలన అందించటంలో.. మౌలిక వసతుల కల్పనలో.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. మహిళలకు రక్షణ ఇవ్వటంలో.. ఉద్యోగ కల్పనలో.. శాంతిభద్రతలను పరిరక్షించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ప్రజల ఛీత్కారాలు పెరిగిపోవడంతో.. ప్రజా సమస్యలపై ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసిపి ప్రభుత్వం గడప గడప కార్యక్రమాన్ని బస్సు యాత్రగా మార్చింది.
బస్సు యాత్రను కూడా ప్రజలు అడ్డుకోవటం ఖాయం. ఇక వైసీపీకి మిగిలింది హెలికాప్టర్, విమాన యాత్రలే అని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి.బాబు ఎద్దేవా చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-25-at-2.04.32-PM-1024x518.jpeg)