కోనసీమ అల్లర్లపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన నాయకులు

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్: అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్ల ఘటనపై కాకినాడ ముత్తా క్లబ్ లో జనసేన నాయకుల సమక్షంలో బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పచ్చని కోనసీమ భగ్గుమంది. కోనసీమ అల్లర్లపైన, అనంతబాబు డ్రైవర్ హత్య పైన సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి.

వైసీపీ పార్టీ అధికారం లోకి వఛ్చిన తరువాత.. ఎప్పుడూ జరగని విధ్వంసాలు జరుగుతున్నాయి.. ఒకటి దళిత డ్రైవర్ హత్య.. మరియు అమలాపురం విధ్వంసం.

రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వయిరీ పై మాకు నమ్మకం లేదు.

తమ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేస్తే ఇప్పటి వరకు స్పదించని హోంమంత్రి.. అమలాపురం అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి ఈ అల్లర్లలో జనసేన ప్రమేయం ఉందని అంటున్నారు.

మీ నిఘా విభాగం ఏమైంది. మంత్రి ఇంటికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు.

కోనసీమ జిల్లా కు ఒక ఎస్పీ ఉండి కూడా ఎందుకు కాపాడలేకపోయారు. గతంలో ఒక డిఎస్పీ స్ధాయి అధికారి ఉన్నప్పుడే ఎంతో సమర్ధవంతంగా పనిచేసారు.

మీ స్వార్ధ రాజకీయాల కోసం అంబెద్కర్ పేరును వివాదం చేస్తున్నారు.

అమలాపురంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేయడం మానేసి .. ప్రతి పక్షపార్టీలపై ..బురదజల్లే పనిలో హోమ్ మినిస్టర్ ఉంది.

జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ముద్దాయి అనంతబాబుని మీడియా సమావేశంలో గారు గారు అని సంబోదించడం. దారుణం.. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు వైసీపి ప్రభుత్వంలోనే సాధ్యం అని కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా అమలాపురం జనసేన ఇంచార్జీ రాజబాబు మాట్లాడుతూ..

అమలాపురం సంఘటన పోలీసుల వైఫల్యమే.

ఉదయం 500 మంది ఆందోళన కారులు ఉండగా.. 2 గంటలకు అంత మంది ఎలా వచ్చారు దాని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది.

మంత్రి ఇంటి వద్ద వందమంది మాత్రమే ఉన్న ఆందోళన కారులను పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు.

ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉంది. కోనసీమ పరిరక్షణ సమితిలో ఉన్న వారందరూ వైసిపి నాయకులే.

అమలాపురం సంఘటనను జనసేన మీద రుద్దే ప్రయత్నం ప్రభుత్వం కుట్ర చేస్తుంది.

జనసేన నాయకులు గానీ.. కార్యకర్తలు గానీ అమలాపురం ఆందోళనలో పాల్గొనలేదు. మా నాయకుడు ఆదేశాలు మేరకు జనసైనికులు సంయమనం పాటించి అల్లర్లకు దూరంగా ఉన్నారు.

ఈ సందర్భంగా ముమ్మిడివరం ఇంచార్జీ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ..

ఇళ్ళ పైకి వెళ్ళి తగలబెడతం చాలా హేయమైన చర్య.

పి.కె ప్లాన్ లో భాగంగానే ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టారు.

రాజకీయాల కోసం అంబెద్కర్ పేరును రాజకీయం చేయడం దారుణం.

ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ..

అనంత బాబు డ్రైవర్ హత్య సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అమలాపురం అల్లర్లను సృష్టించారు.

డ్రైవర్ హత్యలో అనంతబాబుతో ఇంకెవరు ఉన్నారో బయట పెట్టాలి.

అమలాపురం అల్లర్లకు జనసేనకు సంబంధం ఉన్నట్లు హోం మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి.