రామసముద్రం మండలంలో గడప గడపకి జనసేన

మదనపల్లి నియోజకవర్గం: రామసముద్రం మండలంలో బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి గడప గడపకి జనసేన కార్యక్రమాన్ని ప్రజలకి కరపత్రాలు అందజేస్తూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలలోకి చేరవేస్తూ గాజు గ్లాసు గుర్తును విస్తృతంగా తీసుకెళుతుంటే ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల గురించి చెబుతున్నారని, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, రెడ్డెమ్మ, క్రాంతి బంగారం, జైరాజ్, చంద్రశేఖర, లవన్న, జనర్దన్, నవాజ్, సత్య జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.