జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి: జనసేన పార్టీ కార్యకర్త బాలు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పరామర్శిచారు.‌ వాయల్పాడు మండలం పత్తేపురానికి చెందిన జనసేన కార్యకర్త బాలు తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామదాస్ చౌదరి బుధవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫతేపురం వెళ్ళి, నిబద్ధత కలిగి, పార్టీ కోసం నిరంతరం శ్రమించే బాలు కుటుంబాన్ని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పరమర్శించి, ఆర్థిక సాయం చేయడం జరిగింది. రామదాస్ చౌదరి తోపాటు జగదీష్, అడపా సురేంద్ర, జనార్ధన్, రెడ్డెమ్మ పాల్గొన్నారు.