ప్రజాస్వామ పాలనలో ఉన్నామా?.. రౌడిల పరిపాలనలో ఉన్నామా?: గంగారపు

  • రామచంద్ర యాదవ్ పై దాడిని ఖండించిన గంగారపు రామదాసు చౌదరి

పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసు చౌదరి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన నేపథ్యంలో రామదాసు చౌదరి రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్ళి ఆయనను పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్ర యాదవ్ గారి ఇంటిపై గత ఆదివారం అర్దరాత్రి దాదాపుగా ఐదువందల మందికి పైగా వైసీపీ నాయకులు దాడి చేసి ఇల్లు, కార్లు, గేట్లు ద్వంసం చేసి భయంకరమైన వాతావరణం సృష్టించారు.. ఇలాంటి అరాచక సంఘటనలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసు వ్యవస్థ.. అసలు మనం ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా..? లేక రౌడిల పరిపాలనలో ఉన్నామా..? అని ప్రశ్నిస్తూ.. వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. అదేవిధంగా ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం కూడా ఈ ఘటననను తీవ్రంగా ఖండించారు.