అంగన్ వాడి వర్కర్స్ కి సంఘీభావం తెలిపిన గంగారపు స్వాతి

మదనపల్లె: గత పది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్ వాడి వర్కర్స్ కి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గంగారపు స్వాతి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ ఈ విషయాన్నీ అధికారులు, పాలకులు ఎవరూ స్పందించకపోవడం చాలా బాధాకరమని తల్లి తరువాత తల్లిగా పిల్లలను చూసుకొనే ఈ అంగన్వాడీ వర్కర్స్ కి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించకపోవడం, అలానే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామన్నా ఈ ప్రభుత్వం పెంచకుండా వారికీ ఇబ్బంది కలిగించటం చాలా బాధాకరం అని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యొక్క డిమాండ్స్ ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొనివేళ్తామని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేకూరెలా చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ,ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, చంద్రశేఖర, నవాజ్, జంగాల గౌతమ్, రాజారెడ్డి, రవి, నాగవేణి,జంగాల గౌతమ్, జనర్దన్ తదితరులు పాల్గొన్నారు.