జనసేనానిపై అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన గవర సోమశేఖర్ రావు

గాజువాక: పెందుర్తి నియోజకవర్గంలో కాపు సామాజిక భవనానికి మౌలిక వసతులు కల్పించుకుండా ప్రారంభించి, తాము అధికారంలోకి వచ్చి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పుకోలేక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు తన యొక్క అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గాజువాక నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డ్ ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెప్పుకోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదని, అధికారంలో ఉండి కాపు కుల రిజర్వేషన్ కోసం కానీ, కాపు కార్పొరేషన్ కు నిధులు తేలేక, ఐటీ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా తేలేక తన అసమర్థతను, అవగాహన రాహిత్యాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీలాంటి నాయకులు కాపు కులంలో పుట్టడం మా దురదృష్టం అని మీ అసమర్ధతను చూసి మీ తాత తండ్రులు బ్రతికి ఉంటే మీ వ్యవహార శైలికి బాధపడేవారని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే మీరు ఎక్కడ పోటీ చేసిన కాపులు అందరూ ఏకమై మీకు ఇంటికి పంపించే రోజు దగ్గర్లోనే ఉందని, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమశేఖర్ రావు హెచ్చరించారు.