గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 12 వ రోజు

  • 12వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులతో సమావేశం

పాలకొండ, వీరఘట్టం మండలంలో, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సహకారంతో, ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను, రాష్ట్రంలో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, గాజు గ్లాస్ గుర్తు – జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని మత్స పుండరీకం, జనసేన జానీ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు జనసేన కార్యకర్తలు, గోపాల్, సుమన్, అమల, వినోద్, సాయి, ప్రణీత్, కృష్ణ, నాగరాజు, మక్క బాబ్జి సంతు పాల్గొన్నారు.