గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 31వ రోజు
పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 31వ రోజులో భాగంగా వీరఘట్టం మండలం టౌన్ లో మండల జనసేన పార్టీ నాయకులు పర్యటన చెయ్యడం జరిగింది. జనసేనజానీ మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో రోడ్ విస్తరణ పేరుతో రోడ్ వెడల్పు పనులు ప్రారంభమై నేటికి రెండు సంత్సరాలపైగా అవ్వుతుంది, కానీ నత్తనడక పనులతో ఎక్కడ గోతులు అక్కడనే అలానే ఉండటంతో ప్రజలు త్రివ్రంగా ఇబ్బందులు పడుతున్నారని జనసేన జానీ ప్రభుత్వానికి మరోసారి గుర్తు చెయ్యడం జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ వీరఘట్టం టౌన్ లో పరిశుభ్రత కూడా సరిగ్గా అవ్వడం లేదు అని కాలువాలు చూస్తే అర్ధమవుతుంది అని అలానే టౌన్ రోడ్లు పనులు వేగవంతం చెయ్యాలి అని ఏపీ గవర్నమెంట్ కి స్థానిక నేతలకి విన్నపం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం టౌన్ జనసేన పార్టీ నాయుకులు కర్నేని సాయి పవన్, వావిలపల్లి భూషణ్, సొండి సుమన్, దూసి ప్రణీత్, సొండి సుమన్, బొమ్మాళి వినోద్ పాల్గొన్నారు. అలాగే వీరఘట్టం మండల బీజేపీ నాయుకులు గుణుపూరు వెంకట్ నాయుడు, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-28-at-19.44.40-461x1024.jpeg)