ప్రజాపరిపాలన కోసం పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వండి: బత్తుల వెంకటలక్ష్మి
- “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” కు మహిళల నుంచి విశేష ఆదరణ.
- అడుగడుగునా ఈ అరాచక పాలన భరించలేక ప్రజలే పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం బలంగా ఎదురుచూస్తున్న వైనం
రాజానగరం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో జరిగిన “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర”లో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా గ్రామంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ పాదయాత్రకు మహిళల నుంచి అపూర్ణ ఆదరణ లభించడం విశేషం. వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ. ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నామని, జనసేన పార్టీకే ఓటు వేస్తామని వారు చెప్పడంతో స్థానిక జనశ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని, ప్రజాపాలన రావాలంటే “జనసేన ప్రభుత్వం” రావాలని అభ్యర్థిస్తూ జనసేన విధివిధానాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ మహాపాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-21.22.30-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-19.36.17-1024x574.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-19.36.19-1024x766.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-19.36.18-1024x574.jpeg)