ప్రజాపరిపాలన కోసం పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వండి: బత్తుల వెంకటలక్ష్మి

  • “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” కు మహిళల నుంచి విశేష ఆదరణ.
  • అడుగడుగునా ఈ అరాచక పాలన భరించలేక ప్రజలే పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం బలంగా ఎదురుచూస్తున్న వైనం

రాజానగరం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో జరిగిన “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర”లో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా గ్రామంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ పాదయాత్రకు మహిళల నుంచి అపూర్ణ ఆదరణ లభించడం విశేషం. వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ. ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నామని, జనసేన పార్టీకే ఓటు వేస్తామని వారు చెప్పడంతో స్థానిక జనశ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని, ప్రజాపాలన రావాలంటే “జనసేన ప్రభుత్వం” రావాలని అభ్యర్థిస్తూ జనసేన విధివిధానాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ మహాపాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.