గుడ్ మార్నింగ్ సిఎం సార్: గుడివాడలో రెండవ రోజు

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 15 ,16 ,17 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల దుస్థితిపై డిజిటల్ కాంపెయిన్ సందర్బంగా గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ అద్వర్యంలో స్టానిక కెటిఆర్ మహిళా కళాశాల ఎదురుగా గల రోడ్లు అస్తవ్యస్తంగా వుండటంతో అక్కడ జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బూరగడ్డ శ్రీకాంత్‌ (ఇంఛార్జ్), పాలంకి సారథి, కొదమల గంగారావు, పేర్ని జగన్‌(జిల్లా అద్యక్షులు) మరియు ఇంటూరి గజేంద్ర(మండల అద్యక్షులు) మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే రోడ్లు వేయాలని సీఎం జగన్‌ని, కొడాలి నానిని మీడియా పూర్వకంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాదె కిరణ్, మజ్జి శ్రీనివాస్, జేమ్స్, సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, మాచర్ల రామకృష్ణ, చింతా దుర్గా రామకృష్ణ (ఐటి కోఆర్డినేటర్), అయ్యప్ప, కరీం, చరణ్, దండమే వెంకట్రమణ, గంటా చైతన్య, తథితరులు పాల్గొన్నారు.