బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలుపుటకు ప్రభుత్వం కుట్ర

ఆరకు: బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలుపుటకు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనిపై గిరిజన ఎమ్మెల్యేలు మరియు ఎంపీ ఎందుకు స్పందించడం లేదు. ముఖ్యంగా గిరిజన సలహా మండలి కమిటీ సభ్యులుగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఉన్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా కనీసం అరకు ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయం పై స్పందించకపోతే రానున్న రోజుల్లో గిరిజనులు ఆయనకు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.