వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: లీలాకృష్ణ

*వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన లీలాకృష్ణ
*తమ గోడును వినిపించిన నిర్వాసితులు..
*బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి..

కపిళేశ్వరపురం: కపిళేశ్వరపురం మండలం కేదార్లంక, దానంమర్రి తదితర ముంపు ప్రాంతాల్లో ఆదివారం మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పర్యటించారు. పంటలు నష్టపోవడంతో కన్నీరు మున్నీరైన రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా లంకలన్నీ వరద ముంపులోనే ఉన్నాయన్నారు. అధికారులు గానీ, అధికార పార్టీ నాయకులు గానీ ఎవరూ కూడా ముంపు ప్రాంతాలలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న బాదితుల వైపు కన్నెత్తి చూడకపోవడం చాలా దారుణమని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో కనీసం నిత్యావసర వస్తువులు కూడా అందచేయలేని నిస్సహాయతలో ఉన్న ప్రభుత్వ తీరుపై దుయ్యబట్టారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.