రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రారెడ్డి

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. 6, 7, 8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. విద్యార్థులరను పాఠశాలకు పంపే విషయంలో మాత్రం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.