ఘనంగా మేడ గురుదత్ పుట్టినరోజు వేడుకలు

  • గురుదత్ పుట్టినరోజు మెగా రక్తదాన శిబిరం గ్రాండ్ సక్సెస్

రాజానగరం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గురుదత్ అభిమాన దళం ఆధ్వర్యంలో సత్య సూర్య బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా గురుదత్ పై ఉన్న అభిమానంతో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా హాజరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలబడిన మేడా గురు ప్రసాద్ కి అభినందనలు తెలపడం జరిగింది. పుట్టినరోజు అంటే హడావిడి ఒక్కటే కాదు, ఇలాంటివి సేవా కార్యక్రమాలు కూడా చేయటం మంచిది. ఇలాంటి సేవాకార్యక్రమాలు చేసే అభిమానులు గురుదత్ కి ఉండడం అయన అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, చిరంజీవి గారి ప్రో టీం & ఎక్స్-నేవీ చిలికూరి సురేష్, ఏడిద బాబీ, మూడు మండలలా అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కారిచర్ల విజయ్, మండపాక శ్రీను, కందికట్ల అరుణ, కామిశెట్టి హిమశ్రీ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

  • రాజమహేంద్రవరం గురుదత్ ఆఫీసులో

రాజమహేంద్రవరం గురుదత్ ఆఫీసులో ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ కి చిరంజీవికి (పి.ఆర్.ఓ టీం) చిలికూరి సురేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేయించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.