ధవళేశ్వరంలో జన చైతన్య శంఖారావం

రాజమండ్రి రూరల్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం కార్యక్రమం గురువారం ధవళేశ్వరం గ్రామంలో నుండి ప్రారంభమవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గ్రామం మొత్తం తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను వివరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.