ఘనంగా జంగాల శివరామ్ రాయల్ పుట్టిన రోజు వేడుకలు

మదనపల్లె, సమాజ సేవలో ముందుండే జంగాల శివరామ్ రాయల్ ప్రజలకు మరింత సేవ చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, అడపా సురేంద్ర, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. పేదలకు సేవ చేయడం ద్వారానే సంతృప్తి అని నమ్మి సామాజిక బాధ్యతగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా అందరివాడుగా పేరు తెచ్చుకున్న జంగాల శివరామ్ రాయల్ చిరకాలం తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో‌ సోమవారం జన్మదినం పురస్కరించుకుని గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు.‌ ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ కు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి, పూలహారాలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ‌కేక్ తినిపించి సంతోషం పంచుకున్నారు. రాజకీయ నాయకులు, అతిరధ మహారధులు హజరై శుభకాంక్షాలు తెలియజేశారు.‌ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమించే జంగాల శివరామ్ రాయల్ పార్టీ కోసం అహర్నిశల శ్రమిస్తారని కొనియాడారు. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించిన ముందుగానే వుండి చురుకుగా పాల్గొనడం, సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పార్టీ పటిష్ఠం కోసం పని చేయడం సంతోషంగా వుందన్నారు. పార్టీ కార్యక్రమంలో ఇంటింటా కరపత్రాలు పంపిణి చేసి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలకు వివరించడంలో శివరామ్ రాయల్ ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఎంతో కష్టపడి, ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయించడం జరుగుతుందని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ నాయకుడు జంగాల శివరామ్ రాయల్ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించడంతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, దేవదేవుడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్నారు. అనంతరం‌ జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన మీద అభిమానంతో తనకోసం వచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీడీపి నాయకులు నాదెండ్ల విద్యా సాగర్,మధుబాబు, ఆర్జె వెంకటేష్,గంగారపు నవీన్ చౌదరి,రాష్ట్ర చేనేత అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు,నిమ్మనపల్లి అధ్యక్షులు ప్రదీప్ సింగ్, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, గడ్డం లక్ష్మిపతి, చంద్రశేఖర్, రాజారెడ్డి, మేకలచెర్వు అర్జున, పురం నగేష్, ఫాజిల్, తోట కళ్యాణ్, గంగులప్ప, విజయ్ కుమార్, నాగవేణి, గండికోట లోకేష్, కుమార్, జనార్దన్, రేణుక, నిరంజన్, చరణ్, లోకేష్, జయ, సంతోష్, హితేష్, ఆర్.వి కిషోర్, కిషోర్, పవన్, నిఖిల్, ఆదర్శ్, సాయి, ఉమేష్, రాఘవ, సీన, లికిత్, శ్రీనివాసులు, చంద్ర మోహన్, జయ, శివ, అగ్వేటి, శ్రీధర్, హర్ష తదితరులు పాల్గొన్నారు.