ఘనంగా యాదమరి మండల జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

  • అమ్మానాన్న ఓ పవన్ కళ్యాణ్
  • యాదమరి మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

పూతలపట్టు: పవన్ కళ్యాణ్ కోసం యువత ఆరాటపడుతున్నారన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. అమ్మా, నాన్న, ఓ పవన్ కళ్యాణ్ అంటూ యువత నినదిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను అందరిలోకి తీసుకెళ్లేందుకు జనసైనికులు కష్ట పడుతున్నారన్నారు‌. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. అంతకు ముందు యాదమరి మండలం పూలకండ్రిగలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అకెపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంఛార్జి శివ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు శివయ్య, ఆనంద్, మండల అధ్యక్షులు పురుషోత్తం, కుమార్, మనోహర్,చంద్రయ్య, టిడిపి ఇంఛార్జి మురళి మోహన్ , మండల కన్వీనర్ గిరిధర్ బాబు, జిల్లా కార్యదర్శి కోదండ యాదవ్,టిడిపి పరిశీలకులు భొమ్మన శ్రీధర్, క్లస్టర్ ఇంఛార్జి, మోహన్ నాయుడు , సర్పంచ్ కొక ప్రకాష్, మండల అధ్యక్షులు దిలీప్, మురార్జి తదితర టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.