సత్తుపల్లిలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి నరేష్ ఆదేశాల మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలవేసి రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు శివాజీ మిరియాల ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ సూరిశెట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్ జబీర్ సయ్యద్ సత్తుపల్లి మండల అధ్యక్షులు సింగపోగు అప్పారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రవి వర్మ సెక్రటరీ వలపుల నాగబాబు కల్లూరు మండల అధ్యక్షులు సాయిచంద్ సంగీతం వేంసూర్ మండలం నాయకులు బండారు తిరుపతి రాజు, పరిమిశెట్టి వీరబాబు, రాధాకృష్ణ, ప్రశాంత్, సైదులు, బాబురావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.