కంకర వేశారు రోడ్డును మరిచారు

  • జనఘోష జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా వెలిగొండ రోడ్డు పరిశీలన

ఉరవకొండ: జనఘోష జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మండల అధ్యక్షుడు చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో వెలిగొండ రోడ్డును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ మాట్లడుతూ.. ఉరవకొండ మండల కేంద్రం నుంచి వెలిగొండ గ్రామానికి మధ్యన ఉన్న రహదారి 4 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీరాజ్ అధికారులు కోటి 85 లక్షల రూపాయలు ఉపాధి నిధులను కేటాయించడం జరిగింది. రోడ్డు నిర్మాణం పనులు మొదలుపెట్టి దాదాపు 3 నెలల కాలం కావస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని పాత రోడ్డును పెకలించి కొత్త రోడ్డు నిర్మాణం కోసం ఇంతవరకు ఒక 500 మీటర్లు కంకరను వేయడం జరిగింది, మిగిలిన పనులు మొదలు పెట్ట లేదని తెలిపారు. ఉరవకొండ జనసేన బుధవారం రోడ్డుని పరిశీలించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేయడం జరిగిందని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రమేష్, బోగేష్, జయకుమార్, ధనుంజయ, చందు రూపేష్, కిరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.